రూ. 2 లక్షల 50 వేలతో గణపతికి అలంకరణ

513చూసినవారు
పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా, శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సుమారు 2.5 లక్షల రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో స్వామివారిని అలంకరించారు. గత తొమ్మిది రోజులుగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం శనివారం స్వామివారి ఊరేగింపు, నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఉత్సవ కమిటీ సభ్యులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Job Suitcase

Jobs near you