రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేయడానికి వైసీపీ డిజిటల్ పుస్తకాన్ని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఆదివారం తణుకులోని పార్టీ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచకం పెరిగిందని, వైపీనీ నేతలపై దాడులు అధికమయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.