ఆదివారం, భీమడోలు మండలం పూళ్ల వద్ద తణుకు డిపోనకు చెందిన ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ఏలూరు నుంచి తణుకు వెళ్తున్న బస్సు పూళ్ల వద్దకు చేరుకోగానే, గుర్తుతెలియని వ్యక్తులు బస్సును ఆపి డ్రైవర్ గన్నేపల్లి కృష్ణప్రసాద్పై దాడి చేసి కొట్టారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.