ఆచంట మండలం అయోధ్యలంక, భీమలాపురం, ఆచంట వేమవరం గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పర్యటించారు. మొంథా తుఫాను బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకులు పంపిణీ చేసి, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.