అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్వచ్ఛంద రక్తదాన, ఆరోగ్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. మహిళా సాధికారత అంటే కేవలం చట్టాలపై అవగాహన మాత్రమే కాదని, వారి శారీరక ఆరోగ్యం, క్షేమం కూడా ప్రధానమని ఈ సందర్భంగా తెలిపారు.