ఆచంట మండలం వేమవరానికి చెందిన చేనేత కార్మికుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ బుధవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో తాను అతుకులు, కుట్లు లేకుండా రూపొందించిన అరుదైన జాతీయ జెండాను మంత్రికి చూపి, దాని ప్రాముఖ్యాన్ని వివరించారు. ఈ అరుదైన జెండాను ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగురవేసేలా ప్రభుత్వం తరఫున కృషి చేయాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా లోకేశ్ ఆయనను అభినందించారు.