పెనుమంట్ర మండలం నెగ్గిపూడి గ్రామానికి చెందిన గొలుగూరి ఆనందరెడ్డి (60) శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన ఏపీ 37 సీఎం 1383 యాక్టీవా బండిపై వెళ్లినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు ప్రారంభించారు. ఆనందరెడ్డి ఆచూకీ తెలిసినవారు పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు.