
మావుళ్ళమ్మ ఆలయంలో 1108 మహిళల గీతా పారాయణం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణంలో భాగంగా 1108 మంది మహిళలు సహస్ర గళ సంపూర్ణ భగవద్గీత పారాయణం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బోండాడ నాగ భూషణం మాట్లాడుతూ భగవద్గీత పఠనం ద్వారా ఆత్మజ్ఞానం, సత్ప్రవర్తన అలవడి జన్మసాఫల్యం కలుగుతుందని తెలిపారు. శ్రీగణపతి సచ్చిదానంద స్వామి వారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం జరిగింది.






































