ఆపదలో ఉన్నవారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. మంగళవారం భీమవరం టీడీపీ కార్యాలయంలో దుర్గాపురం దండెల నాగబాబుకు రూ. 3,50,000, రాయలం గ్రామానికి చెందిన మానుకొండ కిరణ్ కుమార్ కు రూ. 2,51,288 లను ఎల్ఓసి ద్వారా ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసినట్లు ఆమె వెల్లడించారు.