మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ, ఈనెల 11వ తేదీ ఆదివారం భీమవరం ప్రకాశం సర్కిల్లో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సీతారాం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ దీక్షలో పార్టీ సీనియర్ నాయకులు కనుమూరి బాపిరాజుతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొంటారని వివరించారు.