భీమవరం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో మంగళవారం 2025–26 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఎస్సీ, బీసీ వసతి గృహాలు, గురుకులాల విద్యార్థులకు "ప్రతిభా పురస్కారం" కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే లక్ష్యం నిర్ధేశించుకోవడం, కష్టపడే తత్వం అత్యవసరమని, మొదటి విజయంతో ఆగకుండా లక్ష్యం చేరే వరకు నిరంతరం శ్రమించాలని విద్యార్థులకు సూచించారు.