చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తన క్యాంపు కార్యాలయంలో శనివారం మాత సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సావిత్రిబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా, మహిళాభివృద్ధికి ఆమె ఎనలేని కృషి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు.