చింతలపూడిలోని ఈ-కార్ట్ సెంటర్లలో సీఐ క్రాంతి కుమార్, ఎస్సై సతీష్ కుమార్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆన్లైన్ ఆర్డర్లకు సంబంధించిన పార్సిళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కొరియర్ ముసుగులో చట్టవ్యతిరేక వస్తువులు సరఫరా కాకుండా చూడాలని, అనుమానాస్పద వస్తువులేవైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సిబ్బందికి సూచించారు.