మంగళవారం జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి ఎర్ర కాలువ జలాశయంలో చేపల వేటకు వెళ్లిన నగేరి వెంకటేశ్వరరావు అనే మత్స్యకారుడు వలలో చిక్కుకుని మృతి చెందాడు. ఉదయం చేపల వేటకు వెళ్లిన ఆయన, ప్రమాదవశాత్తు వల ఒంటికి చిక్కుకోవడంతో దాన్ని లాగే ప్రయత్నంలో కాలువలో పడిపోయాడు. తోటి మత్స్యకారులు అతని మృతదేహాన్ని వెలికితీశారు.