కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల
విద్యార్థులు పీజీ సెట్ పరీక్షా ఫలితాల్లో అద్భుతమైన ర్యాంకులు సాధించి కళాశాలకు పేరు తెచ్చారని ప్రిన్సిపల్ విజయబాబు తెలిపారు. ఇంగ్లీష్ సబ్జెక్టులో బి. హైమావతి రాష్ట్రస్థాయిలో 188వ ర్యాంకు సాధించగా, పొలిటికల్ సైన్స్ విభాగంలో ఎం. ఝూన్సీరాణి (225), డి. జాన్సన్ (306), వి. దేవి (363) ర్యాంకులు కైవసం చేసుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ
ఫలితాలు కళాశాల ప్రతిష్టను పెంచాయని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.