జంగారెడ్డిగూడెంలోని ఎస్వీఎస్ కల్యాణమండపంలో వర్చువల్ మహానాడు 2026 వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సొంగా రోషన్ కుమార్, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల కోసం చేసిన సేవలను,
ఎన్టీఆర్ ఆశయాలను కొనియాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.