చింతలపూడి పట్టణంలోని స్థానిక గంటా వారి వీధి, ఎరుకలపేటలో సోమవారం
ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొని, అర్హులైన లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లను అందజేశారు. ప్రతి పేదవాడికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.