జంగారెడ్డిగూడెంలో బుధవారం మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన 'పెద్ది' చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా అభిమానులు లక్ష్మి థియేటర్ వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి సంబరాలు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కోసం అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.