పెదవేగి మండలం రామసింగవరంలో సోమవారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై కూలీ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కూచిపూడి గ్రామానికి చెందిన దిమ్మిటి చిన్నరాటయ్య (36) పామాయిల్ తోటలో గలలు మెరుకుతుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నరాటయ్య కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.