ఏలూరు: అధికారులు అప్రమత్తంగా ఉండాలి

83చూసినవారు
ఏలూరు: అధికారులు అప్రమత్తంగా ఉండాలి
గోదావరిలో నీటిమట్టం పెరుగుతున్న కారణముగా వరద ఉధృతి నేపథ్యంలో శుక్రవారం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ జిల్లా అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతరం గస్తీ నిర్వహించాలని పరివాహక ప్రాంతాలకు ఎవ్వరూ వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్వాసితులను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.

సంబంధిత పోస్ట్