ఏలూరులోని శ్రీ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్
విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ టాపర్స్ను అభినందించి, నగదు పురస్కారాలు అందజేశారు. క్రమశిక్షణ, కష్టపడి చదివే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా విజయాలు సాధించవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు.