ఏలూరు దక్షిణ వీధిలో ఆదివారం జరిగిన గంగానమ్మ జాతర మహోత్సవాలలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఏలూరు ప్రజల సుఖ సంతోషాలు, అభివృద్ధికి శక్తిని ప్రసాదించాలని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు కూడా పాల్గొన్నారు.