ముదినేపల్లి: నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

9చూసినవారు
ముదినేపల్లి: నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
మంగళవారం, ముదినేపల్లి మండలం శ్రీహరిపురం శివారు చేవూరుపాలెంలో తుఫాను వల్ల దెబ్బతిన్న వరి పైరును వైసీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని, తుది అంచనాలలో నష్టపోయిన విస్తీర్ణం భారీగా తగ్గిందని ఆరోపించారు. కౌలు రైతులను వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్