నరసాపురం మండలం చిట్టవరానికి చెందిన ప్రముఖ సినీ గాయకుడు గోగులమండల రాజు (42) శుక్రవారం హైదరాబాద్లో గుండెపోటుతో మరణించారు. 'పాడుతా తీయగా' కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన ఆయన, హీరో వెంకటేశ్ నటించిన 'లక్ష్మి' చిత్రంలోని "తార తలుకు తార" పాటతో విశేష గుర్తింపు పొందారు. ఆయన అంత్యక్రియలు శనివారం చిట్టవరంలో జరగనున్నాయి.