మొగల్తూరు మండలం కాళీపట్నం ఈస్ట్ కు చెందిన బాలం కొండబాబు (45) అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అతడిని నరసాపురం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కొండబాబు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మృతుని సోదరుడు బాలం రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.