వందేమాతరం జాతీయ గీతం రచించిన 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, శుక్రవారం ఉదయం మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలోని బండి ముత్యాలమ్మ జిల్లా పరిషత్ హైస్కూలు మరియు గ్రామ పంచాయితీలో ఈ గీతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తాహసిల్దార్ కే. రాజ్ కిషోర్, సర్పంచ్ అడ్డాల సూరిబాబు, కార్యదర్శి ఎం సత్యనారాయణ, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని పాఠశాల మరియు పంచాయితీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.