నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, రెవెన్యూ డివిజన్ పరిధిలోని పట్టణ, గ్రామ ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలని సూచించారు. ప్రజల అర్జీలను ఆన్లైన్ చేసి, నిర్ణీత వ్యవధిలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.