గుంటూరు జిల్లా కొలకలూరు నాటక పరిషత్ నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక రచనల పోటీలో పాలకొల్లుకు చెందిన రచయిత వీరా పోతన రచించిన 'జయహే' నాటికకు ప్రథమ బహుమతి లభించింది. పరిషత్ నిర్వాహకులు పోతనను ఘనంగా సన్మానించి, రూ. 20 వేల నగదు పురస్కారం, షీల్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు గోపరాజు రమణ, గోపరాజు విజయ్ తదితర రంగస్థల ప్రముఖులు పాల్గొన్నారు.