రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, పాలకొల్లు నియోజకవర్గం ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ, అధికారులు, నాయకులు ఎవరూ తనను కలవడానికి రావద్దని, తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు.