విజయవాడ కృష్ణలంకలో బుధవారం అప్పుడే పుట్టిన నవజాత శిశువును బాత్రూంలో వదిలేసిన ఘటన చోటుచేసుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఆ పసికందును గుర్తించారు. తల్లిదండ్రులు పాలకొల్లు సమీపంలోని లంకలకోడేరుకు చెందిన వారిగా గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం గ్రామస్థులు వారిని ఆదుకుంటామని హామీతో చిన్నారిని వారికి అప్పగించారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు చిన్నారికి ‘త్రినేత్రి’గా నామకరణం చేశారు.