తుఫాన్ ప్రభావ నేపథ్యంలో, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం రాత్రి పాలకొల్లు నియోజకవర్గంలోని కూటమి శ్రేణులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో, వార్డుల్లో ప్రజలను అప్రమత్తం చేసి, అధికారులతో కలిసి సహాయ చర్యల్లో పాల్గొనాలని, ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ఎటువంటి ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.