తాడేపల్లిగూడెం: రేపు మంత్రి రాక ఏర్పాట్లు పరిశీలన

11చూసినవారు
తాడేపల్లిగూడెం: రేపు మంత్రి రాక ఏర్పాట్లు పరిశీలన
తాడేపల్లిగూడెం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఎస్వీ రంగారావు సర్కిల్ వద్ద నూతనంగా ప్రారంభం కానున్న రైతు బజార్ ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ రైతు బజార్ రైతులకు సౌకర్యవంతమైన విక్రయ వేదికగా, వినియోగదారులకు తాజా పంటలను నేరుగా అందించే వేదికగా నిలుస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేపు ఈ రైతు బజార్‌ను ప్రారంభిస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.