తాడేపల్లిగూడెం పట్టణంలో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 13వ వర్థంతి సందర్భంగా ఆదివారం టీడీపీ ఇన్ ఛార్జ్ వలవల బాబ్జి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎర్రన్నాయుడు పార్టీకి అచంచలమైన అంకితభావం, ప్రజల పట్ల అపారమైన ప్రేమతో సేవ చేశారని, ఆయన ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు ఆదర్శప్రాయుడని బాబ్జి అన్నారు. ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.