క్యాన్సర్ మహమ్మారిలా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తణుకులో బుధవారం ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు దాత చిట్టూరి సుజాత తెలిపారు. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. తణుకు జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కె.ఎన్.పద్మావతి కోరారు.