డిసెంబరు 13న తణుకు కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు నాలుగో అదనపు జిల్లా జడ్జి డి. సత్యవతి తెలిపారు. శుక్రవారం తణుకు కోర్టు హాలులో పోలీసు, ఎక్సైజ్ అధికారులతో సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఈ లోక్ అదాలత్లో అన్ని రకాల రాజీ పడు క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసులను పరిష్కరించుకోవచ్చని ఆమె సూచించారు.