తణుకు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే రాధాకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. వారి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.