వీరవాసరం ZPH స్కూల్లో 7వ తరగతి విద్యార్థినులు, తమపై అసభ్యంగా ప్రవర్తిస్తూ, చెప్పలేని మాటలు మాట్లాడుతున్నారని ఉపాధ్యాయుడు వేణుగోపాల్పై హెచ్.యం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. గతంలోనూ 10వ తరగతి విద్యార్థినులపై వేణుగోపాల్ అసభ్యంగా ప్రవర్తించినట్లు, అప్పట్లో హెచ్.యంకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని బాధితులు తెలిపారు. ఈ విషయంపై డీఈఓను వివరణ కోరగా, ఉపాధ్యాయుడికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.