ఉండి పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులను మే 9న జరిగే జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని ఉండి ఎస్సై నసీరుల్లా తెలిపారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజీ పడదగిన క్రిమినల్, ఎక్సైజ్ కేసులు, తగాదాలు, చెక్కు బౌన్స్ కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.