ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 10.55 గంటలకు ఉంగుటూరు మండలం నల్లమాడు చేరుకుని ప్రజా ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం, ఉదయం 11.20 గంటలకు గోపీనాథపట్నంలో డయాలసిస్ రోగులకు పెన్షన్ అందజేస్తారు. మధ్యాహ్నం 1.25 గంటల వరకు నల్లమాడు ప్రజావేదికలో ఆయన పాల్గొంటారు.