నిడమర్రు మండలం అడవికొలనులో బుధవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతోందని విమర్శించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం అసంబద్ధమైనదని, దీనిపై ప్రభుత్వం ప్రజాభిప్రాయం కోరాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.