ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో, రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతులతో మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఆ మాటలను వక్రీకరించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.