Mar 14, 2026, 13:03 IST/
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. గ్యాస్తో సంబంధం లేదంటున్న ఫంక్షన్ హాల్స్
Mar 14, 2026, 13:03 IST
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత తీవ్రమైంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గడంతో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో, ఈ కొరత శుభకార్యాలపై ప్రభావం చూపుతోంది. గతంలో రూ. 800-1000 ఉన్న వెజిటేరియన్ భోజనం ప్లేట్ ధర ఇప్పుడు రూ. 1500కు పెరిగింది. గ్యాస్ కొరతతో కట్టెలు, బొగ్గులపై వంట చేయడానికి హోటళ్లు సిద్ధమవుతున్నాయి, దీంతో ప్లేట్ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఫంక్షన్ హాళ్లు వంట బాధ్యత తమది కాదని, కేవలం పాత్రలు, నీటి సరఫరా మాత్రమే చేస్తామని షరతులు పెడుతున్నాయి.