
డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రైతు సదస్సు
వెంకట్రామన్నగూడెం లోని డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జూన్ 5వ తేదీన "రైతు సదస్సు" జరిగింది. సుస్థిర ఉద్యానవనం, సుభిక్ష ఫలసాయం లక్ష్యంగా ఆధునిక సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీమతి గంటా పద్మశ్రీ, నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేయడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం.






































