తణుకు - Tanuku

తణుకు: యువకుడు మృతి

తణుకు: యువకుడు మృతి

ఇరగవరం మండలం కె.ఇంద్రపర్రుకు చెందిన గోపిశెట్టి రాంబాబు, సత్యవతి దంపతుల కుమారుడు సతీశ్ కుమార్ (28) గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందారు. విశాఖపట్నంలో హెచ్పీ సీ ఎల్లో ఉద్యోగం చేస్తున్న సతీశ్, ఇంటి నిర్మాణ పనులు చూసుకునేందుకు వారం రోజుల కిందట గ్రామానికి వచ్చారు. భవనం పైభాగంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మరణించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి, ఇంటిని నిర్మించి, వివాహం చేయాలనుకున్న తల్లిదండ్రుల కలలు కళ్లముందే ఆరిపోవడంతో వారు గుండెలు పగిలేలా రోదించారు. ఈ ఘటనపై ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా
ఫిబ్రవరి 15వ తేదీనే మహాశివరాత్రి: పండితులు
Feb 13, 2026, 06:02 IST/

ఫిబ్రవరి 15వ తేదీనే మహాశివరాత్రి: పండితులు

Feb 13, 2026, 06:02 IST
2026లో మహా శివరాత్రి పండుగను ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం నాడు జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు. చతుర్దశి తిథి ఫిబ్రవరి 15 సాయంత్రం 5:04 గంటలకు ప్రారంభమై, ఫిబ్రవరి 16 సాయంత్రం 5:34 గంటలకు ముగుస్తుంది. అయితే, హిందూ పండుగలను నిషిత కాలంలో చతుర్దశి వచ్చే రోజున జరుపుకునే నియమం ప్రకారం, మహా శివరాత్రిని ఫిబ్రవరి 15నే జరుపుకోవాలని శాస్త్రోక్తంగా నిర్ణయించారు. రాత్రి శివుని పూజకు అత్యంత పవిత్రమైన సమయం నిషిత కాలం ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 12:09 AM నుండి 1:01 AM వరకు ఉంటుంది. అభిషేకానికి శుభ ముహూర్త సమయాలు కూడా ఫిబ్రవరి 15 సాయంత్రం 6:11 PM నుండి ప్రారంభమై, ఫిబ్రవరి 16 తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి.