ఉండి - Undi

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా
Jan 25, 2026, 05:01 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్

పిడిఎస్‌యు మహాసభ: విద్యార్థుల సమస్యలపై ప్రగతిశీల సంఘం పోరాటం

Jan 25, 2026, 05:01 IST
పిడిఎస్‌యు రాష్ట్ర 23వ మహాసభలో ఆదిలాబాద్ జిల్లా రిపోర్ట్ ను జిల్లా అధ్యక్షులు సీడం సాయికుమార్ ప్రవేశపెట్టారు. గత రెండేళ్ల కాలంలో జరిగిన కార్యక్రమాల నివేదికను సమర్పించారు. రాష్ట్ర కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ, అదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ లేకపోవడం విద్యార్థులకు అన్యాయం చేస్తుందని, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని, ప్రగతిశీల విద్యార్థి సంఘం సరైన మార్గాలను చూపాలని అన్నారు. అమరులైన విద్యార్థి నాయకుల ఆశయాలను సాధించడానికి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలు ఖమ్మం జిల్లా భక్త రామదాసు కళాక్షేత్రంలో మరో రెండు రోజులు కొనసాగుతాయి. ఇందులో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.