దర్శకధీరుడు ఎస్.ఎస్.
రాజమౌళి తన ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి' గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చిత్రంలో ఆఫ్రికా అడవులు, అంటార్కిటికా మంచు ప్రపంచం, రామాయణ గాథల స్ఫూర్తి, ప్రకృతి విపత్తులు వంటి అద్భుతమైన విజువల్ అనుభూతులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలిపారు. అయితే వీటన్నింటికంటే ఒక తండ్రి-కొడుకుల మధ్య ఉండే భావోద్వేగ బంధమే కథకు ప్రధాన బలమని చెప్పారు.
రాజమౌళి వ్యాఖ్యలతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.