AP: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్న్యూస్ చెప్పారు. జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ ప్రారంభమవుతుందని అన్నారు. దీనికి ప్రభుత్వం మొత్తం 2,400 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి సిద్ధం చేస్తోందని, కిలో రూ.18 చొప్పున ప్రజలకు అందించనున్నట్లు వెల్లడించారు.