ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, కరువు పనిపై కేంద్రం కుట్రలు చేస్తుంటే సీఎం చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న నల్ల చట్టాలకు చప్పట్లు కొట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. జీతాలకే అప్పులు చేసే చంద్రబాబు, జీ రామ్ జీ పథకానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఉపాధికి ఉరి పెడుతుంటే ప్రజలకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు.