యూపీ లక్నోలోని ఇంద్రానగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త తనని ‘బందరియా’(కోతి) అని పిలవడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సాదత్ గంజ్లో నివసించే తనుసింగ్, రాహుల్ శ్రీవాస్తవ్ ను నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. బుధవారం సాయంత్రం అందరూ కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో రాహుల్ తన భార్యను ‘బందరియా’ అని పిలిచాడు. ఆ మాటతో తను మనస్తాపం చెంది గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయిందని తెలిపారు.