2026 టీ20 వరల్డ్కప్లో భారత జట్టుకు మెంటర్గా టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ను నియమించే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మెగా టోర్నీకి ముందు అనుభవజ్ఞుడైన ఆటగాడి మార్గనిర్దేశం జట్టుకు ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో ఎంఎస్ ధోనీ టీమిండియాకు మెంటర్గా వ్యవహరించారు.